కాంగ్రెస్ నాయకుల సంబరాలు
ABN , Publish Date - Jun 04 , 2024 | 11:38 PM
మంథని నియోజక వర్గంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గెలుపులో మంథని అధికంగా లీడ్ ఇవ్వ డంతో నియోజకవర్గ కేంద్రమైన మంథని అంబేద్కర్ చౌక్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం సాయంత్రం సంబరాలు జరుపుకున్నారు.
![కాంగ్రెస్ నాయకుల సంబరాలు](https://media.andhrajyothy.com/media/2024/20240604/_c2bf7e2df4.jpg)
మంథని, జూన్ 4: మంథని నియోజక వర్గంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గెలుపులో మంథని అధికంగా లీడ్ ఇవ్వ డంతో నియోజకవర్గ కేంద్రమైన మంథని అంబేద్కర్ చౌక్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం సాయంత్రం సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ, శ్రీధర్బాబు, వంశీలకు మద్దతుగా నినా దాలు చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్ : ఎంపీగా కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ గెలిచినందుకు గాని మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయ కులు టపాసులు పేల్చి స్వీట్లు పంచుకు న్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండ ల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, సింగిల్ విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, నాయకులు అల్లం దేవేందర్, సబ్బని రాజమల్లు, బంగారు రమేష్, శివరామకృష్ణ, రహీం ఖాన్, మాదాసు సతీష్, జిన్న రామచంద్రారెడ్డి, ఆషాడపు సురేష్, రాణవేన శ్రీనివాస్, పొట్యాల మల్లయ్య, ధ్యాగెటి రామచంద్రం, గీస రాజ య్య తదితరులు పాల్గొన్నారు.
జూలపల్లి : జూలపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం వెల్లడైనా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయ కులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ వేరువేరు కార్యక్రమాలలో టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజారిటీతో కైవసం చేసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు చేసుకోగా, దేశంలోనే అత్యదిక పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని మూడవ సారి కేంద్రంలో అధికారం చేపట్టనున్న నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ బీజేపీ కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్ర మాలలో ఆయా పార్టిలకు చెందిన నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.
ధర్మారం : పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ గెలుపు పట్ల మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబ రాలు నిర్వహించారు. చౌరసాలో టాపాసులు కాల్చా రు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంపీణీ చేశారు, ఈ కార్యక్రంమంలో మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
పాలకుర్తి : పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలవడంతో మంగళవారం మండల కేంద్రం లోని టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులను పేల్చి, స్వీట్లను పంపిణీ చేసుకొని ఘనంగా సంబరాలను జరుపుకున్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓదెల : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో మంగళవారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజారిటీతో విజయం సాధించడం పట్ల నాయకులు సంబరాలు నిర్వహించారు. గ్రామాల్లో బానసంచ పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే మండలంలోని ఓటర్లు సరియైున నిర్ణయం తీసుకొని గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించడం పట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మూల ప్రేమ సాగర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
కమాన్పూర్ : పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ విజయం సాధించడాన్ని హర్షిస్తూ మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకు లు టపాసులు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సయ్యద్ అన్వర్ తదితరులు ఉన్నారు.
రామగిరి : పార్లమెంట్ ఎన్నిక ఫలితాల్లో ఎంపీగా గడ్డం వంశీకృష్ణ భారీ మోజార్టీతో గెలువడం పట్ల మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ నాయ కులు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. పన్నూరు సెం టర్ నుంచి బాణాసంచా పేలుస్తూ భారీ ఊరేగింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్లతిరుపతియాదవ్, ఐఎన్టీయుసీ ఉపాఽధ్యక్షుడు కొట రవీందర్రెడ్డి, నాయకులు వనం రాంచందర్రావు, మల్లికార్జున్, కొలిపాక సుజాత, ఆరెల్లి కొంరయ్య, నాగరాజు, తీగల సమ్మయ్య, కాటంసత్యం, ఏరికల బాబురావు, శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.