కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నాయకులు
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:32 AM
మండలంలోని ముత్యంపేట, మల్యాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో సోమవారం చేరారు.
![కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నాయకులు](https://media.andhrajyothy.com/media/2024/20240428/2_ae94057435.jpg)
మల్యాల, ఏప్రిల్ 29: మండలంలోని ముత్యంపేట, మల్యాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో సోమవారం చేరారు. బీఆర్ఎస్ నాయకుడు మ్యాక లక్ష్మణ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ అల్లూరి రాజేశ్వర్రెడ్డి, మల్యాల మాజీ ఉపసర్పంచ్ మంద తిరుపతిగౌడ్, నల్లపు మల్లేశం తదితరులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్లో చేరగా ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పారు. కార్యక్రమంలో నాయకులు ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, శ్రీనివాస్గౌడ్, ముత్యం శంకర్, నర్సింహరెడ్డి, మిలీ్ట్ర శ్రీనివాస్, ప్రశాంత్, కొక్కుల నాగభూషణం, యాగండ్ల సుమన్గౌడ్, బోజగాజు నాగరాజ్గౌడ్ తదితరులు ఉన్నారు