Share News

కేంద్ర బృందం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:30 AM

జిల్లాలో ‘వికసిత్‌ సంకల్ప యాత్ర’ను పరిశీలించేందుకు శుక్రవారం కేంద్ర బృందం పర్యటించనుందని, ఇందు కోసం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు.

కేంద్ర బృందం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, జనవరి 11 : జిల్లాలో ‘వికసిత్‌ సంకల్ప యాత్ర’ను పరిశీలించేందుకు శుక్రవారం కేంద్ర బృందం పర్యటించనుందని, ఇందు కోసం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. కలె క్టరేట్‌లో గురువారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర బృం దం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. కేంద్ర టెక్స్‌టైల్‌ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, వికసిత్‌ సంకల్ప యాత్ర జిల్లా నోడల్‌ అధికారి అజయ్‌గుప్తా ఆధ్వర్యంలో శుక్రవారం కేంద్ర బృందం కోనరావుపేట మం డలం మల్కపేట, బోయిన్‌పల్లి మండలం అనంతపల్లి గ్రామాల్లో వికసిత్‌ సంకల్ప యాత్రను పరిశీలించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ శాఖలు ఆక్టివిటీ, విజయగాధలను తెలిపే స్టాల్స్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ పూజారి గౌతమి, డీఆర్‌డీవో నక్క శ్రీనివాస్‌, డీపీవో రవీందర్‌, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్‌, జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి, జిల్లా మిషన్‌ భగీరథ ఇంట్రా ఈఈ జానకీ పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:30 AM