గ్రూప్-1 ప్రిలిమినరీకి ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - May 29 , 2024 | 11:43 PM
గ్రూప్ - 1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. వచ్చే నెల 9వ తేదీన గ్రూప్ - 1 ప్రిలిమినరీ నిర్వహణపై కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
![గ్రూప్-1 ప్రిలిమినరీకి ఏర్పాట్లు చేయాలి](https://media.andhrajyothy.com/media/2024/20240511/2_1fea53beea.jpg)
సిరిసిల్ల కలెక్టరేట్, మే 29: గ్రూప్ - 1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. వచ్చే నెల 9వ తేదీన గ్రూప్ - 1 ప్రిలిమినరీ నిర్వహణపై కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లా డుతూ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగే గ్రూప్-1 ప్రిలిమ్స్కు జిల్లాలో 4699 మంది అభ్య ర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి సమస్యలు ఉంటే జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ 9398684240 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాలలో టేబుల్ డెస్క్లను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాలలో సీసీ కెమరాలను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలకు వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు ముందుగానే చేరుకోవాలని, ఆలస్యమైన వారిని పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలకా్ట్రనిక్ పరికరాల అనుమతిలేదని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీసీ అధికారులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడిపించాలని, సెస్ అధి కారులు విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోపం లేకుండా ఏర్పాటు చేసు కోవాలని ఆదేశించారు. ఈ సమా వేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యా నాయక్, ఆర్డీవో శ్రీనివాస్, డీఐఈవో మోహన్, డీఈవో రమేష్ కుమార్, డీటీవో లక్ష్మణ్, సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.