గోదామును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
ABN , Publish Date - May 25 , 2024 | 12:33 AM
రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని వేగవంతంగా దిగుమతి చేసుకోవాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ప్రసాద్లాల్ అన్నారు.
![గోదామును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్](https://media.andhrajyothy.com/media/2024/20240511/_a261a711df.jpg)
సుల్తానాబాద్, మే 24 : రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని వేగవంతంగా దిగుమతి చేసుకోవాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ప్రసాద్లాల్ అన్నారు. శుక్ర వారం సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలోని వినాయక రైస్ మిల్లులో ధాన్యం దిగుమతి ప్రక్రియను, గోదామును అదనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ పరి శీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు ధాన్యం అన్లోడింగ్ వేగవంతంగా పూర్తి చేయాలని, ధాన్యం రవాణాపై ప్రత్యేక దృష్టి సారిం చాలన్నారు. రైతులకు మిల్లుల వద్ద ఎలాంటి కోత విధించకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, సంబంధిత అధికా రులు, రైస్మిల్లర్లు పాల్గొన్నారు.