Share News

రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద షెడ్‌ వేయిస్తా..

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:53 AM

కరీంనగర్‌లోని బైపాస్‌రోడ్‌ సమీపంలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం 10 లక్షల నిధులు మంజూరు చేసి షెడ్‌ వేయిస్తానని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ హామీ ఇచ్చారు.

రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద షెడ్‌ వేయిస్తా..

కరీంనగర్‌ కల్చరల్‌, మార్చి 8: కరీంనగర్‌లోని బైపాస్‌రోడ్‌ సమీపంలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం 10 లక్షల నిధులు మంజూరు చేసి షెడ్‌ వేయిస్తానని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. శివరాత్రి సందర్భంగా ఆయన ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ డంప్‌యార్డ్‌ను ఎత్తివేయాలని, షెడ్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందించింది. ఆలయానికి నిత్యం గౌడ కులస్తులు అత్యధికంగా వస్తుంటారని డంప్‌యార్డ్‌ ఉండటంతో దుర్వాసన వెలువడుతోందని, భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ బండి సంజయ్‌ డంప్‌యార్డును త్వరలోనే తరలించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరో 30 లక్షలు కేటాయిస్తానని ప్రకటించారు.

Updated Date - Mar 09 , 2024 | 12:53 AM