Share News

Hyderabad: మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డిల అక్రమాలను బయటపెడతాం..

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:44 PM

మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిల అక్రమాలన్నీ బయటపెడతామని, ఇది కేవలం శాంపిల్‌ మాత్రమేనని, అసలు కథ ముందున్నదని మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, సుధీర్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డిలు తెలిపారు.

Hyderabad: మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డిల అక్రమాలను బయటపెడతాం..

మేడ్చల్‌(హైదరాబాద్): మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిల అక్రమాలన్నీ బయటపెడతామని, ఇది కేవలం శాంపిల్‌ మాత్రమేనని, అసలు కథ ముందున్నదని మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, సుధీర్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డిలు తెలిపారు. చిన్నదామర చెరువు ఎఫ్‌టీఎల్‌లో రాజశేఖర్‌రెడ్డి అక్రమంగా నిర్మాణాలు కట్టాడని, కూల్చివేయాలని 2011లోనే బీజేపీ, సీపీఎం, బీఆర్‌ఎస్‌ వాళ్లు ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు జేఏసీగా ఏర్పాటై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని వారు వివరించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం కూల్చివేతలు జరుగుతున్నాయని, కూల్చివేతలకు సీఎంకు గాని ఎవ్వరికి గాని ఎటువంటి సంబంధం లేదన్నారు

Updated Date - Mar 09 , 2024 | 12:44 PM