Share News

Hyderabad: గ్రేటర్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. కార్వాన్‌లో అత్యధికంగా 37.7 డిగ్రీలు

ABN , Publish Date - Mar 02 , 2024 | 11:56 AM

గ్రేటర్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మార్చి మొదటివారంలో పగటి ఉష్ణోగ్రతలు 36-37 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో పగటిపూట వేడిగాలులు మంట పుట్టిస్తున్నాయి.

Hyderabad: గ్రేటర్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. కార్వాన్‌లో అత్యధికంగా 37.7 డిగ్రీలు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మార్చి మొదటివారంలో పగటి ఉష్ణోగ్రతలు 36-37 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో పగటిపూట వేడిగాలులు మంట పుట్టిస్తున్నాయి. శుక్రవారం కార్వాన్‌(Karavan)లో అత్యధికంగా 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాప్రా, సరూర్‌నగర్‌లలో 36.2 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. మార్చి రెండో వారం నాటికి గ్రేటర్‌లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలుంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రభావం మొదలై మధ్యాహ్నం 12 - 3 గంటల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Updated Date - Mar 02 , 2024 | 01:25 PM