Share News

Hyderabad: పోటీకి పజ్జన్న ఓకే.. అధినేత సూచనతో మనసు మార్చుకున్న వైనం

ABN , Publish Date - Mar 23 , 2024 | 12:08 PM

పార్లమెంట్‌ ఎన్నికల బరిపై పునరాలోచనలో పడిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌(Padma Rao Goud) మనసు మార్చుకున్నట్టు తెలిసింది.

Hyderabad: పోటీకి పజ్జన్న ఓకే.. అధినేత సూచనతో మనసు మార్చుకున్న వైనం

హైదరాబాద్: పార్లమెంట్‌ ఎన్నికల బరిపై పునరాలోచనలో పడిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌(Padma Rao Goud) మనసు మార్చుకున్నట్టు తెలిసింది. శుక్రవారం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌(KCR) పిలిచి మాట్లాడడంతో పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. రెండు రోజుల క్రితం పార్టీ అగ్రనేతల సూచన మేరకు పోటీచేసేందుకు అంగీకరించిన పద్మారావు అనంతరం పునరాలోచనలో పడ్డారు. అభినందనలు చెప్పేందుకు వచ్చిన పార్టీ నేతలకూ తాను పోటీ చేయనని, పుష్పగుచ్చాలు తీసుకురావద్దని గురువారం చెప్పారు. ఈ క్రమంలో పద్మారావును పిలిపించుకున్న కేసీఆర్‌ పోటీ చేయాలని సూచించినట్టు తెలిసింది. దీంతో బరిలో నిలిచేందుకు ఆయన సిద్ధమయ్యారు.

Updated Date - Mar 23 , 2024 | 12:08 PM