చెన్నమనేని పౌరసత్వంపై నేడు హైకోర్టులో విచారణ
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:32 AM
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

వేములవాడ: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గత సంవత్సర కాలంలో చెన్నమనేని ప్రయాణాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, చెన్నమనేనిలకు హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. నేడు మరోసారి పిటిషన్పై హైకోర్టు విచారించనుంది.