Share News

Nizamabad: లోక్‌సభ ఎన్నికల తరువాత దేశంలో రామరాజ్యం: ధర్మపురి అరవింద్

ABN , Publish Date - Jan 18 , 2024 | 08:03 PM

లోక్‌సభ ఎన్నికల తరువాత దేశంలో రామరాజ్యం రాబోతోందని ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) అన్నారు. నిజామాబాద్‌లో ఆయన గురువారం మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవ సందర్భంగా జనవరి 22న ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని కోరారు.

Nizamabad: లోక్‌సభ ఎన్నికల తరువాత దేశంలో రామరాజ్యం: ధర్మపురి అరవింద్

నిజామాబాద్: లోక్‌సభ ఎన్నికల తరువాత దేశంలో రామరాజ్యం రాబోతోందని ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) అన్నారు. నిజామాబాద్‌లో ఆయన గురువారం మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవ సందర్భంగా జనవరి 22న ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని కోరారు.

బీజేపీపాలిత రాష్ట్రాల్లో దేవాలయాలకు రక్షణ ఉందన్నారు. అయోధ్య వివాదానికి కాంగ్రెస్ పార్టీ కారణమని విమర్శించారు. నిజామాబాద్‌వాసుల చిరకాల వాంఛ పసుపు బోర్డు ఏర్పాటు ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఈ సీజన్‌లో పసుపు క్వింటా ధర రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో పసుపు రైతుల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని తెలిపారు.

Updated Date - Jan 18 , 2024 | 08:04 PM