BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం.. ఎప్పుడంటే..
ABN , Publish Date - Jan 17 , 2024 | 04:37 PM
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీరామారావు(KTR) ఆ పార్టీ ఎమ్మెల్సీలతో రేపు(గురువారం) సమావేశం నిర్వహించనున్నారు. లోక్ సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
![BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం.. ఎప్పుడంటే..](https://media.andhrajyothy.com/media/2023/20231205/KTR_8c34aaf7d1.jpg)
హైదరాబాద్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీరామారావు(KTR) ఆ పార్టీ ఎమ్మెల్సీలతో రేపు(గురువారం) సమావేశం నిర్వహించనున్నారు. లోక్ సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుండగా.. ఎమ్మెల్సీలకు లోక్ సభ నియోజకవర్గాల ఇంఛార్జి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత.. ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని చూస్తోంది.
ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా ప్రతి రోజూ తెలంగాణ భవన్ లో సమావేశాలు జరుగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో సన్నద్ధతపై కేటీఆర్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.