Share News

సీపీఆర్‌పై అవగాహన

ABN , Publish Date - Apr 18 , 2024 | 10:52 PM

మంచిర్యాల టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ సిబ్బందికి ప్రథమ చికిత్స, సీపీఆర్‌పై గురువారం హైటెక్‌సిటీ మంచిర్యాల క్లబ్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ శేషారావు ఆధ్వర్యంలో సర్కిల్‌ సిబ్బందికి ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సీపీఆర్‌పై అవగాహన

ఏసీసీ, ఏప్రిల్‌ 18: మంచిర్యాల టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ సిబ్బందికి ప్రథమ చికిత్స, సీపీఆర్‌పై గురువారం హైటెక్‌సిటీ మంచిర్యాల క్లబ్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ శేషారావు ఆధ్వర్యంలో సర్కిల్‌ సిబ్బందికి ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుండెజబ్బు వయస్సుతో నిమిత్తం లేకుండా వస్తున్నాయన్నారు. ఆపదలో ఉన్న వారికి ప్రథమ చికిత్స అందించి సమీప ఆసుపత్రులకు తరలించాలన్నారు. కరెంటు షాక్‌, పాముకాటుకు గురైనప్పుడు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అం దించి ఆసుపత్రులకు తరలించాలన్నారు. త్వరలో తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. కైసర్‌, రాజన్న, రాజం, శ్రీనివాస్‌, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, సభ్యులు కాసర్ల శ్రీనివాస్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 10:52 PM