కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనతో ప్రజలకు కష్టాలు
ABN , Publish Date - Apr 18 , 2024 | 10:56 PM
కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనతో అన్ని వర్గాల ప్రజలు, రైతులు కష్టాల కడలిలో చిక్కుకున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘనాథ్ అన్నారు. గురువారం మ్యాదరి పేట, చింతపల్లి గ్రామల్లో పార్టీ శ్రేణులతో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి గోమాస శ్రీని వాస్ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేప ట్టారు.
దండేపల్లి, ఏప్రిల్ 18: కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనతో అన్ని వర్గాల ప్రజలు, రైతులు కష్టాల కడలిలో చిక్కుకున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘనాథ్ అన్నారు. గురువారం మ్యాదరి పేట, చింతపల్లి గ్రామల్లో పార్టీ శ్రేణులతో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి గోమాస శ్రీని వాస్ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేప ట్టారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్యారం టీల పేరుతో రైతులను మోసం చేస్తోందన్నారు. రైతులకు రూ.2లక్షల పంట రుణమాఫీ, రూ.15వేల రైతు భరోసా, కౌలు రైతులకు రూ.12వేల ఆర్ధిక సాయం, వరికి క్వింటాల్కు 500 బోనస్ హామీ ఇచ్చి రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, కేంద్రాల వద్ద వసతులు కల్పించాలన్నారు. మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు అక్కల దివ్య, పార్టీ నాయకులు ప్రభాకర్, గురువయ్య, సురేందర్, లక్ష్మన్, సంతోష్, వెంకటేష్, అశోక్, సత్యనారాయణ, మహేష్, కిషన్ పాల్గొన్నారు.