Share News

మొదటి దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి

ABN , Publish Date - Mar 26 , 2024 | 10:05 PM

లోక్‌సభ ఎన్ని కల్లో భాగంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియను ప్రశాం తంగా నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ మొదటి దశను పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియను అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌తో కలిసి పరిశీలించారు.

మొదటి దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 26: లోక్‌సభ ఎన్ని కల్లో భాగంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియను ప్రశాం తంగా నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ మొదటి దశను పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియను అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌తో కలిసి పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని చెన్నూరు, బెల్లం పల్లి, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గాల్లో 1,131 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 1111 మంది సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, 2187 మంది ఇతర ప్రిసైడింగ్‌ అధికారులు మొత్తం 4,429 మంది సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి చేశామన్నారు. సిబ్బందికి ఎస్‌ఎంస్‌తోపాటు సంబంధిత ఉత్త ర్వులను అందిస్తామని తెలిపారు. విధులను సమ ర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల తహసీ ల్దార్‌ శ్రీనివాస్‌, ఈ డిస్ర్టిక్‌ మేనేజర్‌ సునీల్‌, ఎన్ని కల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 10:05 PM