బీసీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి
ABN , Publish Date - Apr 19 , 2024 | 10:33 PM
జిల్లా కేంద్రంలో బీసీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని శుక్రవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏవో రాజేశ్వర్కు వినతిపత్రం అందజేశారు.
నస్పూర్, ఏప్రిల్ 19 : జిల్లా కేంద్రంలో బీసీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని శుక్రవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏవో రాజేశ్వర్కు వినతిపత్రం అందజేశారు. జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జిల్లా కేంద్రాల్లో బీసీ భవనాలు నిర్మిస్తామన్నారని పేర్కొన్నారు. అధికారం చేపట్టి నాలుగు నెలలు గడుస్తున్నా బీసీ భవనాల ఊసే లేదని, ప్రభుత్వం త్వరితగతిన స్థలం కేటాయించి భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలన్నారు. పట్టణ అధ్యక్షుడు బొడెంకి మహేష్, జిల్లా నాయకులు జైపాల్ సింగ్, నాయకులు అంకం సతీష్, కొంతం రాజు, అరేందుల రాజేశం తదితరులు పాల్గొన్నారు.