Share News

బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలకు విద్యార్థుల ఎంపిక

ABN , Publish Date - Jun 11 , 2024 | 10:09 PM

జిల్లాలోని బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హత గల షెడ్యూల్డ్‌ కులముల విద్యార్థులను లక్కీడ్రా పద్ధతిన ఎంపిక చేశామని అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ తెలిపారు.

బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలకు విద్యార్థుల ఎంపిక

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 11 : జిల్లాలోని బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హత గల షెడ్యూల్డ్‌ కులముల విద్యార్థులను లక్కీడ్రా పద్ధతిన ఎంపిక చేశామని అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ తెలిపారు. మంగళవారం సమీ కృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో షెడ్యూల్డు కులముల అభివృద్ధి ఉప సంచాలకులు పోటు రవీందర్‌రెడ్డితో కలిసి లక్కీడ్రా నిర్వహిం చారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ 1వ తరగతిలో ప్రవేశాలకు 154 మంది దరఖాస్తులు చేసుకోగా లక్కీడ్రా ద్వారా 92 మందిని, 5వ తరగతిలో 160 మంది దరఖాస్తు చేసుకోగా 91 మందిని ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమాధికారి రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 10:09 PM