ఎంపీఎల్ క్రికెట్ లీగ్ బ్రోచర్ల విడుదల
ABN , Publish Date - Mar 28 , 2024 | 10:55 PM
మంచిర్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ బ్రోచర్లను గురువారం పాత మంచిర్యాలలోని క్రికెట్ మైదానంలో ఓఎం ఎస్సీ అధ్యక్షుడు బొలిశెట్టి కిషన్ ఆవిష్కరించారు.
ఏసీసీ, మార్చి 28: మంచిర్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ బ్రోచర్లను గురువారం పాత మంచిర్యాలలోని క్రికెట్ మైదానంలో ఓఎం ఎస్సీ అధ్యక్షుడు బొలిశెట్టి కిషన్ ఆవిష్కరించారు. కిషన్, గురు అకాడమీ ఆర్గనైజర్ దుర్గాప్రసాద్లు మాట్లాడుతూ ఈ నెల 31లోగా పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల జట్ల వేలం ఉంటుందని ఆసక్తి గల వారు రూ.300 చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రాంచైజ్ ఓనర్లు రూ.15 వేలు చెల్లించి జట్టును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని, ఏప్రిల్ 14 నుంచి టోర్నమెంట్ ప్రారంభమవుతుందన్నారు. వివరాలకు గురు అకాడమీలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఓల్డ్ మంచిర్యాల స్పోర్స్ట్క్లబ్ సభ్యులు ఎర్రం ప్రభాకర్,తూముల ప్రభాకర్, ఎల్ల మల్లేష్, విజయ్ పాల్గొన్నారు.