Share News

ప్రైవేట్‌ ఆసుపత్రులు నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:31 PM

జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు సూచించారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహ కులతో సమావేశం నిర్వహించారు.

ప్రైవేట్‌ ఆసుపత్రులు నిబంధనలు పాటించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 12: జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు సూచించారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహ కులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి రిజిస్ర్టే షన్‌ సర్టిఫికెట్‌, వైద్యుల వివరాలు, అర్హతలు, వైద్య సేవలను డిస్‌ప్లే చేయా లని సూచించారు. ప్రస్తుతం పని చేస్తున్న వైద్యుల వివరాలు నమోదు చేయించుకోవాలని, లేని వారిని తొలగించాలని, కన్సల్‌టెంట్‌ డాక్టర్లు ఏ టైంకు వస్తారు, ఫీజు వివరాలను డిస్‌ప్లే చేయాలన్నారు. అంబులెన్స్‌ ద్వారా వచ్చిన కేసుల వివరాలు ప్రత్యేక రిజిష్టర్‌లో నమోదు చేయాలని, ఆసుపత్రి నుంచి పంపే కేసులను, అంబులెన్స్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే వారికి తగిన సౌకర్యాలు కల్పిం చాలన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకొంటామన్నారు. సమావేశంలో డీఈఎంఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 10:31 PM