Share News

సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలి

ABN , Publish Date - Jan 11 , 2024 | 10:38 PM

జిల్లాలో గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రాథమిక సదు పాయాల కల్పనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిం చాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ రాహుల్‌తో కలిసి జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై సమావేశం నిర్వహించారు.

సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 11: జిల్లాలో గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రాథమిక సదు పాయాల కల్పనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిం చాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ రాహుల్‌తో కలిసి జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా అభి వృద్ధి ప్రక్రియను ప్రణాళికబద్దంగా నిర్వహించాలని, అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పారిశు ధ్యం, పాఠశాలలు, అంగన్‌వాడీల్లో ప్రాథమిక సదు పాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిం చారు. జడ్పీ సీఈవో నరేందర్‌,డీఆర్‌డీవో శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 10:38 PM