పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి
ABN , Publish Date - Mar 04 , 2024 | 10:37 PM
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడు దల చేయాలని సోమ వారం అదనపు కలెక్టర్ రాహుల్కు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సం దర్భంగా జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నారన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, మార్చి 4: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడు దల చేయాలని సోమ వారం అదనపు కలెక్టర్ రాహుల్కు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సం దర్భంగా జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నారన్నారు. విద్యాలయాల్లోని సమస్యలను పరిష్కరించాలని, అను మతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు సానియా, అభినవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి: స్కాలర్షిప్లు, ఫీజురియింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దీపక్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులు, విద్యారంగ సమస్యలను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ యువ వికాసం ప్రతి విద్యార్ధికి రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని ప్రకటించి అమలు చేయడం లేదన్నారు.