Share News

మంచిర్యాల జిల్లాకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టాలి

ABN , Publish Date - Jun 07 , 2024 | 10:21 PM

మంచిర్యాల జిల్లాకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టాలని బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు అన్నారు. శుక్రవారం ఐబీ చౌరస్తా అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

మంచిర్యాల జిల్లాకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టాలి

ఏసీసీ, జూన్‌ 7: మంచిర్యాల జిల్లాకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టాలని బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు అన్నారు. శుక్రవారం ఐబీ చౌరస్తా అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. వారు మా ట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడిలో జన్మించి స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని ఎమ్మెల్యే, మంత్రి పదవులను అలంకరించారన్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్నా రన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీకి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సరైన గుర్తిం పు ఇవ్వలేదన్నారు. టీఆర్‌ ఎస్‌ పార్టీని ప్రారంభించినప్పుడు లక్ష్మణ్‌ బాపూజీ ఇంటిని పార్టీ కార్యాలయానికి ఇచ్చారన్నారు. ఆయనకు సరైన గౌరవం దక్కాలంటే జిల్లాకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టాలన్నారు. నాయకులు గుమ్ముల శ్రీనివాస్‌, తుల మదుసూదన్‌ రావు, గజెల్లి వెంకన్న, రమేష్‌వర్మ, రాములు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 10:21 PM