Share News

Kumaram Bheem Asifabad: గోండి ధర్మ పరిరక్షణకు యువత కృషిచేయాలి

ABN , Publish Date - Jan 14 , 2024 | 10:29 PM

సిర్పూర్‌(యు), జనవరి 14: అతిప్రాచిన గోండి ధర్మపరిరక్షణకు యువత కృషి చేయాల్సిన అవ సరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఘన్‌ సాంస్థన్‌ వ్యవస్థాపక పీఠాధిపతి కుమ్ర భగవంత్‌రావు అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కిన్వట్‌ తాలుకా వసంత్‌వాడి గ్రామంలో ఏర్పాటు చేసిన జంగోలింగో దీక్ష స్వీకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

 Kumaram Bheem Asifabad: గోండి ధర్మ పరిరక్షణకు యువత కృషిచేయాలి

- ఘన్‌సాంస్థన్‌ పీఠాధిపతి కుమ్ర భగవంత్‌రావు

సిర్పూర్‌(యు), జనవరి 14: అతిప్రాచిన గోండి ధర్మపరిరక్షణకు యువత కృషి చేయాల్సిన అవ సరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఘన్‌ సాంస్థన్‌ వ్యవస్థాపక పీఠాధిపతి కుమ్ర భగవంత్‌రావు అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కిన్వట్‌ తాలుకా వసంత్‌వాడి గ్రామంలో ఏర్పాటు చేసిన జంగోలింగో దీక్ష స్వీకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆధ్యాత్మిక మార్గంతోనే సమాజంలో శాంతి నెలకొంటుందన్నారు. జంగో లింగో దీక్షతో మనఃశ్శాంతి కల్గుతుందన్నారు. దీక్ష ను ప్రతిఒక్కరూ తీసుకొని గోండి ధర్మంను పాటిం చాలన్నారు. గోండి ధర్మ పరిరక్షణకు యువత ముందుకు రావాలని ఘన్‌సాంస్థన్‌ ప్రచార కుడు, గోండ్వాన గాయ కుడు ఉర్వేత మోహన్‌ అన్నారు. కార్యక్రమంలో గోండిధర్మ కోయపున్నెం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం ఆనంద్‌ రావు, ఘన్‌ సాంస్థన్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడం జగీజిన్‌, జంగు బాయి చానెల్‌ మంగం విశ్వంరావు, రాష్ట్ర సభ్యుడు కొట్నాక మోహ పత్‌రావు, ఆత్రం కిషన్‌ మహరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 10:29 PM