Kumaram Bheem Asifabad: రీడింగ్ రూంను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Mar 11 , 2024 | 10:01 PM
కాగజ్నగర్ టౌన్, మార్చి 11: స్థానిక ప్రజాకార్యాలయంలో ప్రారంభించిన నూత న లైబ్రరీ, రీడింగ్ రూంను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు అన్నా రు. సోమవారం లైబ్ర రీ, రీడింగ్రూంను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
![Kumaram Bheem Asifabad: రీడింగ్ రూంను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే](https://media.andhrajyothy.com/media/2024/20240306/4_4_808aefbd0d.jpg)
- ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు
కాగజ్నగర్ టౌన్, మార్చి 11: స్థానిక ప్రజాకార్యాలయంలో ప్రారంభించిన నూత న లైబ్రరీ, రీడింగ్ రూంను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు అన్నా రు. సోమవారం లైబ్ర రీ, రీడింగ్రూంను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మాజీఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తమరావు స్మారక లైబ్రరీ, రీడింగ్రూంను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా దివంగత పురుషోత్తమరావు స్మారక లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోటీపరీక్షల విద్యార్థులు, ప్రతిఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మాజీ కౌన్సిలర్లు ఈర్ల విశ్వేశ్వర్ రావు, సిందం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, నాయకులు వీరభద్రాచారి, వెంకటేశ్, శ్రీశైలం పాల్గొన్నారు.