Kumaram Bheem Asifabad: మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయం
ABN , Publish Date - Jun 11 , 2024 | 10:11 PM
బెజ్జూరు, జూన్ 11: మత్తుపదార్థాల నిర్మూలన ప్రభుత్వ ధ్యేయమని కాగజ్నగర్ ఎక్సైజ్ సీఐ రవి అన్నారు. మంగళవారం మండలంలోని సలుగుపల్లి గ్రామంలో గంజాయి, గుడుంబా, మత్తుపదార్థాలపై గ్రామ స్థులకు అవగాహన కల్పించారు.
బెజ్జూరు, జూన్ 11: మత్తుపదార్థాల నిర్మూలన ప్రభుత్వ ధ్యేయమని కాగజ్నగర్ ఎక్సైజ్ సీఐ రవి అన్నారు. మంగళవారం మండలంలోని సలుగుపల్లి గ్రామంలో గంజాయి, గుడుంబా, మత్తుపదార్థాలపై గ్రామ స్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తుపదార్థాల జోలికి పోవద్దని సూచించారు. గుడుంబా, గంజాయితో కుటుం బాలు చిన్నాభిన్నమవుతాయని అన్నారు. గుడుంబా, ఇతర మత్తుపదార్థాల విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై సురేష్, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.