Share News

Kumaram Bheem Asifabad : జాతీయస్థాయి సాధన సర్వే పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేయాలి: డీఈవో

ABN , Publish Date - Jul 31 , 2024 | 10:02 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 31: నవంబర్‌లో జరుగనున్న జాతీయస్థాయి సాధనసర్వే పరీక్షకు విద్యా ర్థులను సిద్ధం చేయాలని జిల్లా విద్యాధికారి అశోక్‌ తెలిపారు. జాతీయస్థాయి సాధనసర్వే పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం, పరీక్ష విధానం ఇతరఅంశాలపై ఉపాధ్యాయులతో బుధవారం సమా వేశం నిర్వహించారు.

Kumaram Bheem Asifabad : జాతీయస్థాయి సాధన సర్వే పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేయాలి: డీఈవో

- డీఈవో అశోక్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 31: నవంబర్‌లో జరుగనున్న జాతీయస్థాయి సాధనసర్వే పరీక్షకు విద్యా ర్థులను సిద్ధం చేయాలని జిల్లా విద్యాధికారి అశోక్‌ తెలిపారు. జాతీయస్థాయి సాధనసర్వే పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం, పరీక్ష విధానం ఇతరఅంశాలపై ఉపాధ్యాయులతో బుధవారం సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలో జిల్లాను ఉన్నతస్థానంలో నిలిపేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నోడల్‌అఽధికారి, పరీక్షల సహాయ కమిషనర్‌ ఉదయబాబు, కాంప్లెక్స్‌ హెడ్మాస్టర్లు సుభాష్‌, ఖాజానిజాముద్దీన్‌, విషయ నిపుణులు శంకర్‌, చైతన్యకుమార్‌, ప్రశాంత్‌,రాజేంద్ర ప్రసాద్‌, వెంకటేష్‌, కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలకు ఇన్స్‌పైర్‌ దోహదపడుతుంది..

విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు పెంచడానికి ఇన్‌స్పైర్‌ దోహదపడుతుం దని డీఈవో అశోక్‌ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని జడ్పీ సెకండరీ పాఠశాలలో కేజీబీవీ, ఆదర్శపాఠశాలలు, ప్రైవేటుపాఠశాలల సైన్స్‌ ఉపాధ్యా యులకు ఇన్‌స్పైర్‌ ఓరియంటేషన్‌ ప్రోగ్రాంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 6నుంచి 10వతరగతి విద్యార్థులకు ఇన్‌స్పైర్‌ నామినేషన్‌ పూర్తిచేయాలన్నారు. దీనికిగాను ప్రతిపాఠశాలలో ఐడి యాబాక్స్‌ను ఏర్పాటుచేయాలన్నారు. విద్యార్థులను తమచుట్టూ ఉన్న సమ స్యలను గుర్తించేలా చేయాలన్నారు. ఆసమస్యల సాధనకు చేసే ప్రయత్నంలో భాగంగా ప్రాజెక్టు రూపొందించేలా చూడాలన్నారు. ఎన్నికైన ప్రాజెక్టుకి పది వేలరూపాయలు కేంద్రప్రభుత్వం అందిస్తుందన్నారు. సైన్స్‌టీచర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 10:02 PM