Share News

Kumaram Bheem Asifabad: పీవీటీజీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలి

ABN , Publish Date - Jan 11 , 2024 | 10:51 PM

ఆసిఫాబాద్‌, జనవరి 11: పీవీటీజీల అభివృద్ధిపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిసారిం చాలని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. గురు వారం కలెక్టరేట్‌లో పీవీటీజీల అభివృద్ధి, పోషణ్‌ వాటిక, ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియపై మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, ఐసీడీఎస్‌, ఇంజ నీరింగ్‌ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Kumaram Bheem Asifabad:  పీవీటీజీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలి

- అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌, జనవరి 11: పీవీటీజీల అభివృద్ధిపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిసారిం చాలని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. గురు వారం కలెక్టరేట్‌లో పీవీటీజీల అభివృద్ధి, పోషణ్‌ వాటిక, ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియపై మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, ఐసీడీఎస్‌, ఇంజ నీరింగ్‌ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఈనెల 15న ప్రధానమంత్రి వర్చువల్‌ విధానం ద్వారా పీవీటీజీ లబ్ధిదారులతో మాట్లాడే కార్యక్రమం ఉన్నందున సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. జిల్లాలో 50అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈనెల 20లోగా పోషణ్‌ వాటికలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాపాల నలో అందిన దరఖాస్తుల్లోని వివరా లను ఆన్‌లైన్‌లో నమోదుచేసే ప్రక్రి యను ఈనెల 17లోగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ నెల15న ప్రధాన మంత్రి వర్చువల్‌ విధానం ద్వారా పీవీటీజీ లబ్ధిదారులతో మాట్లాడే కార్యక్రమం ఉన్నందున కలెక్టరేట్‌లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఇందులో భాగంగా పీవీటీజీ ఆదివాసులు, గిరిజనులందరు ఆధార్‌కార్డు, బ్యాంకుఖాతా కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆయుష్మాన్‌భారత్‌ ఆరోగ్యకార్డుల పంపిణీ చేయాలని అధికారులను ఆదే శించారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 10:51 PM