Share News

Kumaram Bheem Asifabad: సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ సురేష్‌కుమార్‌

ABN , Publish Date - Mar 22 , 2024 | 10:25 PM

ఆసిపాబాద్‌, మార్చి 22: రాబోయేపార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ఎలాంటి వర్గబేధాలు లేకుండా అల్లర్లు జరగకుండా ప్రజలంతా సహక రించా లని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్‌ పట్టణంలో పారా మిలటరీ దళాల ఫ్లాగ్‌ మార్చ్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

 Kumaram Bheem Asifabad:   సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ సురేష్‌కుమార్‌

ఆసిపాబాద్‌, మార్చి 22: రాబోయేపార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ఎలాంటి వర్గబేధాలు లేకుండా అల్లర్లు జరగకుండా ప్రజలంతా సహక రించా లని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్‌ పట్టణంలో పారా మిలటరీ దళాల ఫ్లాగ్‌ మార్చ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పారామిలిటరీ బలగాల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించి వారికి ఎన్నికలకు సంబంధించిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సమస్యాత్మకపోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేకదృష్టి సారించా మన్నారు. ఎవరైనా చట్టవిరుద్దంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించాలని చూసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రభాకర్‌, డీఎస్పీ సదయ్య, సీఐలు సతీష్‌, శ్రీనివాస్‌, చిట్టబాబు, ఎస్సైలు పాల్గొన్నారు.

శిక్షణను పర్యవేక్షించిన ఎస్పీ

జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో వారం రోజుల పాటు గ్రేహౌండ్స్‌ బలగాలకు ఇస్తున్న ప్రత్యేకశిక్షణను శుక్రవారం ఎస్పీ సురేష్‌కుమార్‌ పర్యవేక్షిం చారు. ఈసందర్భంగా సిబ్బందితో కలిసి మధ్యాహ్నభోజనం చేశారు. అనం తరం ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది శారీరక దారుడ్యం కోసం, మావోయిస్టు కదిలికలపై ప్రత్యేకనిఘా కోసం ఈశిక్షణ ఎంతో ఉపయోగపడు తుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రభాకర్‌, డీఎస్పీ సదయ్య, సీఐ సతీష్‌, ఆర్‌ఐ పెద్దన్న, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 10:25 PM