Kumaram Bheem Asifabad: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ
ABN , Publish Date - Mar 28 , 2024 | 11:21 PM
సిర్పూర్(టి), మార్చి 28: మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సురేష్కుమార్ గురు వారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలను ఎస్సై దీకొండ రమేష్ను అడిగి తెలుసుకున్నారు.
సిర్పూర్(టి), మార్చి 28: మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సురేష్కుమార్ గురు వారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలను ఎస్సై దీకొండ రమేష్ను అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలవద్ద బందోబస్తు ఏర్పాటు చేయాల న్నారు. అనంతరం వెంకట్రావుపేట, హుడ్కిలి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను సందర్శించి సిబ్బంది అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ కరుణాకర్, సీఐ సాదిక్పాషా, ఎస్సై దీకొండ రమేష్ ఉన్నారు.
చెక్ పోస్టును తనిఖీ చేసిన ఎస్పీ
కౌటాల: మండలంలోని తుమ్మిడిహెట్టి చెక్ పోస్టును గురువారం ఎస్పీ సురేష్కుమార్ తనిఖీ చేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అక్రమమద్యం, డబ్బు, గంజాయి, మాదక ద్రవ్యాలు, ఎన్నికలలో ప్రభావితం చేసే బహుమతులను రవాణా కాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో వీడియో తీయాలని సూచించారు. అనంతరం కౌటాల పోలీసుస్టేషన్ను సందర్శించి సిబ్బంది విధులను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ కరుణాకర్, సీఐ సాదిక్పాషా, ఎస్సై మధుకర్, సిబ్బంది పాల్గొన్నారు.