Kumaram Bheem Asifabad:ఆదిలాబాద్లో రెండవ రోజు ఒకే నామినేషన్
ABN , Publish Date - Apr 19 , 2024 | 10:48 PM
ఆదిలాబాద్, ఏప్రిల్19 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి రెండవరోజు శుక్రవారం ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్పార్టీ అభ్యర్థి ఆత్రంసుగుణ తరపున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, ఆదిలాబాద్, బోథ్ ఇన్చార్జీలు కందిశ్రీనివాస్రెడ్డి, ఆడే గజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కరీం, శ్రీలేఖతో కలిసి నామినేషన్ పత్రాలను జిల్లా రిటర్నింగ్ అధికారి రాజార్షిషాకు అందజేశారు.
- ఆత్రం సుగుణ గెలవడం ఖాయం : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు
ఆదిలాబాద్, ఏప్రిల్19 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి రెండవరోజు శుక్రవారం ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్పార్టీ అభ్యర్థి ఆత్రంసుగుణ తరపున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, ఆదిలాబాద్, బోథ్ ఇన్చార్జీలు కందిశ్రీనివాస్రెడ్డి, ఆడే గజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కరీం, శ్రీలేఖతో కలిసి నామినేషన్ పత్రాలను జిల్లా రిటర్నింగ్ అధికారి రాజార్షిషాకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలవడం ఖాయమన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 15ఎంపీ సీట్లను సాధించడమే లక్ష్యమన్నారు. 5న్యాయసూత్రాలు, ఆరు గ్యారెంటీలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. జిల్లా చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా మహిళకు అవకాశం కల్పించిందన్నారు. అందులో ఆదివాసీ బిడ్డకు అవకాశం కల్పించడం ఎంతో అదృష్టమన్నారు. బీజేపీ మతం పేరుతో, దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ భిన్నత్వంలో ఏకత్వంలా అందరూ కలిసి మెలిసి ఉండాలని ఈ ప్రాంతాన్ని సమష్టిగా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతోందన్నారు.