Kumaram Bheem Asifabad: విద్యాసంవత్సరానికి ముందే పాఠశాలలను సిద్ధం చేయాలి
ABN , Publish Date - Mar 14 , 2024 | 11:34 PM
ఆసిఫాబాద్, మార్చి 14: విద్యాసంవత్సరం 2024-25 ప్రారంభానికి ముందే అన్ని పాఠశాల లను పూర్తిస్థాయి సౌకర్య లతో సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అన్నారు.
![Kumaram Bheem Asifabad: విద్యాసంవత్సరానికి ముందే పాఠశాలలను సిద్ధం చేయాలి](https://media.andhrajyothy.com/media/2024/20240313/4_4_4f9025f8ed.jpg)
ఆసిఫాబాద్, మార్చి 14: విద్యాసంవత్సరం 2024-25 ప్రారంభానికి ముందే అన్ని పాఠశాల లను పూర్తిస్థాయి సౌకర్య లతో సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అన్నారు. గురువారం విద్యాశాఖ కార్యదర్శితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాకలెక్టర్లు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవిద్యాసంవత్సరం ముగింపు అనంతరం వేసవి సెలవులు 45రోజులపాటు ఉంటాయన్నారు. ఈక్రమంలో పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులు చేయడంతోపాటు సౌకర్యాలను పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసేలా అధి కారులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ సకా లంలో జరిగే విధంగా ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. సమావేశంలో సీపీవో నరేం దర్, డీఆర్డీవో సురేందర్, డీఈవో అశోక్, జిల్లా సంక్షేమశాఖల అధికారులు సజీవన్, రమాదేవి పాల్గొన్నారు.