Kumaram Bheem Asifabad: ఘనంగా రాజమాత జిజియాబాయి జయంతి
ABN , Publish Date - Jan 12 , 2024 | 10:34 PM
ఆసిఫాబాద్, జనవరి 12: ఛత్రపతి శివాజీ మహా రాజ్ మాతృమూర్తి జిజియాబాయి జయంతి వేడుక లను ఆరె సంక్షేమసంఘం ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జైరాం మాట్లాడుతూ రాజమాత జిజియాబాయి ఛత్ర పతి శివాజీని చిన్నప్పటి నుంచే దేశభక్తి నూరి పోస్తూ ధర్మాన్ని రక్షించాలని శివాజీకి నేర్పించిందని అన్నారు.

ఆసిఫాబాద్, జనవరి 12: ఛత్రపతి శివాజీ మహా రాజ్ మాతృమూర్తి జిజియాబాయి జయంతి వేడుక లను ఆరె సంక్షేమసంఘం ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జైరాం మాట్లాడుతూ రాజమాత జిజియాబాయి ఛత్ర పతి శివాజీని చిన్నప్పటి నుంచే దేశభక్తి నూరి పోస్తూ ధర్మాన్ని రక్షించాలని శివాజీకి నేర్పించిందని అన్నారు. అలాంటి మహనీయురాలి జయంతి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో గోపాల్, తిరుపతి, అన్నారావ్, మారుతి, దిలీప్, శంకర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి: మండలకేంద్రంలోని శివాజీ చౌక్లో జిజియాబాయి జయంతిని ఆరెసంఘం ఆధ్వ ర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెచిత్రపటానికి పూలమాలలువేసి నివాళుల ర్పిం చారు. కార్యక్రమంలో ఎంపీపీనానయ్య, వెంకన్న, శ్రీనివాస్, రాజన్న, శ్రీమన్నారాయణ,సత్తయ్య, సురేష్, గురువు, సంజీవ్, ప్రశాంత్,అంజన్న,పోశన్న, సాయి కిరణ్, సతీష్, శంకర్,చంద్రశేఖర్ పాల్గొన్నారు.
సిర్పూర్(టి): మండల కేంద్రంలో ఆరె సంఘం ఆధ్వర్యంలో జిజియాబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నీరేటి రేఖ, శంకర్, మోహన్, శ్యాంరావు, సత్యనారాయణ, మహేష్, ఎంపీటీసీలు సోహెల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
కౌటాల: మండల కేంద్రంలో ఆరెసంక్షేమ సంఘ భవనంలో జిజియాబాయి, స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళులు అర్పిం చారు. కార్యక్రమంలో సంఘం జిల్లాగౌరవ అధ్యక్షుడు వానుపటేల్, మండలాధ్యక్షుడు వసంత్,దత్తు, మధు కర్, సునీల్, సోమ్దాష్, తిరుపతి, నానాజీ, ప్రకాష్, బిక్కాజీ, రవి, మిథున్, భీమన్న, శంకర్ పాల్గొన్నారు.
పెంచికలపేట: మండలకేంద్రంలో బీజేపీ నాయకులు స్వామివివేకానంద, జిజియాబాయి జయంతిని ఘనంగానిర్వహించారు. వారి చిత్రపటా లకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మధుకర్, నగేష్, భాస్కర్, మహేష్, శంకర్, కాంతారావు, బాపూజీ, సంతోష్, పి సంతోష్, ప్రభాకర్ పాల్గొన్నారు.