Kumaram Bheem Asifabad : పెండింగ్ వేతనాలను చెల్లించాలి
ABN , Publish Date - Jan 05 , 2024 | 11:15 PM
ఆసిఫాబాద్, జనవవరి 5: పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ, బీసీ హాస్టళ్లలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లిం చాలని డిమాండ్ చేశారు.
![Kumaram Bheem Asifabad : పెండింగ్ వేతనాలను చెల్లించాలి](https://media.andhrajyothy.com/media/2023/20231205/2_2_5061e4db77.jpg)
ఆసిఫాబాద్, జనవవరి 5: పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ, బీసీ హాస్టళ్లలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లిం చాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఎస్సీ హాస్టల్స్లో 7, బీసీ హాస్టల్స్లో 11 నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయన్నారు. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్, హెల్త్కార్డు, గుర్తింపు కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, తిరుపతి, సత్యశ్రీ, లత, కవిత, కొమురయ్య, లక్ష్మి, శారద, రమాదేవి, రేవతి, కవిత, రాణి, రమ్య, పుష్పలత, రత్నమాల తదితరులు పాల్గొన్నారు.