Share News

Kumaram Bheem Asifabad: రోగులకు సక్రమంగా వైద్యం చేయాలి: డీఎంహెచ్‌వో

ABN , Publish Date - Feb 17 , 2024 | 10:19 PM

సిర్పూర్‌(టి), ఫిబ్రవరి 17: గ్రామీణప్రాంత ప్రజలకు సక్రమంగా వైద్యం చేయాలని డీఎంహెచ్‌వో తుకారాంభట్‌ అన్నారు. మండలంలోని లోనవెల్లి పీహెచ్‌సీని శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన పలు వురికి పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Kumaram Bheem Asifabad:  రోగులకు సక్రమంగా వైద్యం చేయాలి: డీఎంహెచ్‌వో

సిర్పూర్‌(టి), ఫిబ్రవరి 17: గ్రామీణప్రాంత ప్రజలకు సక్రమంగా వైద్యం చేయాలని డీఎంహెచ్‌వో తుకారాంభట్‌ అన్నారు. మండలంలోని లోనవెల్లి పీహెచ్‌సీని శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన పలు వురికి పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బంది రిజిస్టర్‌, మందుల నిలువలు, అవుట్‌ పేషంట్ల సంఖ్య తదితర విష యాలపై డాక్టర్‌ నవతను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సిబ్బంది నర్సయ్య, రాజలింగు, జలాల్‌, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 10:19 PM