Kumaram Bheem Asifabad: హైకోర్టులో ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఊరట
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:04 PM
ఆసిఫాబాద్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది.

ఆసిఫాబాద్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రహైకోర్టులో కోవ లక్ష్మికి వ్యతిరేకంగా ఎన్నికల సందర్భంగా దాఖలైన ఫిటిషన్ను శుక్రవారం కోర్టు కొట్టివేసింది. కోవ లక్ష్మి ఎన్నికల అఫిడవిట్లో ఆదాయ పన్ను లెక్కలు తప్పుగా ఉన్నాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి శ్యాంనాయక్ కోర్టుకెక్కారు. 2023ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె ఎన్నిక చెల్లదని, మోసపూరితంగా గెలిచారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈకేసు తొమ్మిదినెలలుగా కొనసాగుతోంది. అయితే శుక్రవారం కేసు విచారించిన కోర్టు దానిని కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. కోవ లక్ష్మి ఎన్నికల అఫిడవిట్లో ఇన్కం టాక్స్ లెక్కలు తప్పులు లేవని తేల్చింది.