Kumaram Bheem Asifabad: కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
ABN , Publish Date - Sep 21 , 2024 | 10:21 PM
ఆసిఫాబాద్ రూరల్/వాంకిడి/బెజ్జూరు/తిర్యాణి/రెబ్బెన, సెప్టెంబర్ 21: మాజీమంత్రి, తెలంగాణ ఉద్యమనేత కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతిని శనివారం లక్ష్మణ్ సేవాసదన్, పద్మశాలిసంఘం ఆధ్వర్యంలో ఆసిఫాబాద్లో, మండలాల్లో ఘనంగా జరుపుకొన్నారు.
ఆసిఫాబాద్ రూరల్/వాంకిడి/బెజ్జూరు/తిర్యాణి/రెబ్బెన, సెప్టెంబర్ 21: మాజీమంత్రి, తెలంగాణ ఉద్యమనేత కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతిని శనివారం లక్ష్మణ్ సేవాసదన్, పద్మశాలిసంఘం ఆధ్వర్యంలో ఆసిఫాబాద్లో, మండలాల్లో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆసిఫాబాద్లో జరిగిన కార్యక్రమంలో పద్మశాలిసంఘం సభ్యులు ఆంజనేయులు, లింగయ్య, శ్రీకాంత్, ప్రణయ్, వాంకిడిలో లక్ష్మణ్ సేవాసదన్ సంస్థచైర్మన్ గాదే అవినాష్, వైస్చైర్మన్ అశోక్, ప్రధానకార్యదర్శి మడావిదౌలత్, కుమార్, శ్రీసత్యసాయి సేవా సంస్థ అధ్యక్షుడు గాదే అనిల్కుమార్, పద్మశాలి సంఘం నాయకులు ఎంగలి రాకేష్, రాంచదర్, సంతోష్, శ్రీనివాస్, రామగిరి కుస్మాకర్, శాంతిలాల్, బెజ్జూరులో పద్మశాలి సంఘం నాయకులు తిరుపతి, వెంకటేష్ సత్యనారాయణ, పెంటన్న, సంజీవ్, శ్రీనివాస్, గణేష్, విజయ్కుమార్, శ్రీకాంత్, వెంకటేష్, నాగేష్, సదాశవ్, జావీద్, తిర్యాణిలో పద్మశాలిసంఘం సభ్యులు శంకర్, మల్లేష్, గౌరయ్య, సత్యనా రాయణ, రాజేష్, అంజన్న, అశోక్, రాములు, రాజు,తిరుపతి, వెంకటేష్, శ్రీనివాస్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.