Kumaram Bheem Asifabad: కౌటాల విద్యార్థినికి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రాష్ట్ర రెండో ర్యాంకు
ABN , Publish Date - Apr 25 , 2024 | 09:44 PM
కౌటాల, ఏప్రిల్ 25: ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఫలితాల్లో మండలంలోని బోదంపల్లి గ్రామానికి చెందిన గీతభవాని రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. బోదంపల్లి గ్రామానికి చెందిన మోర్లె శ్రీనివాస్-లక్ష్మి దంపతుల కూతురు గీతాభవానికి ఇంటర్లో బైపీసీ మొదటి సంవత్సరంలో 437/440 మార్కులు సాధించింది.
కౌటాల, ఏప్రిల్ 25: ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఫలితాల్లో మండలంలోని బోదంపల్లి గ్రామానికి చెందిన గీతభవాని రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. బోదంపల్లి గ్రామానికి చెందిన మోర్లె శ్రీనివాస్-లక్ష్మి దంపతుల కూతురు గీతాభవానికి ఇంటర్లో బైపీసీ మొదటి సంవత్సరంలో 437/440 మార్కులు సాధించింది. గీతాభవానికి 1నుంచి 4వతరగతి వరకు మండలకేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలో, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిర్పూర్(టి) సోషల్ వెల్ఫేర్లో, ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని శ్రీచైతన్య కళాశాలలో చదువుకుంది. ఈసందర్భంగా పలువురు ఆమెతోపాటు తల్లిదండ్రులను అభినందిస్తూ సన్మానించారు.