Share News

Kumaram Bheem Asifabad: సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ

ABN , Publish Date - Jan 19 , 2024 | 10:46 PM

తిర్యాణి, జనవరి 19: సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కోలాం ఆదిమ గిరిజనులు అందరిపై ఉందని రాష్ట్ర మహిళాకమిషన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి బాయి అన్నారు. శుక్రవారం మండలంలోని దంతన్‌పల్లిలో కోలాం ఆదిమ గిరిజనుల ఆరాధ్యదైవం దంతన్‌పల్లి భీమయ్యక్‌స్వామి జాతరలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Kumaram Bheem Asifabad:  సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ

- రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి

తిర్యాణి, జనవరి 19: సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కోలాం ఆదిమ గిరిజనులు అందరిపై ఉందని రాష్ట్ర మహిళాకమిషన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి బాయి అన్నారు. శుక్రవారం మండలంలోని దంతన్‌పల్లిలో కోలాం ఆదిమ గిరిజనుల ఆరాధ్యదైవం దంతన్‌పల్లి భీమయ్యక్‌స్వామి జాతరలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయకమిటీ సభ్యులు డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ భీమయ్యక్‌స్వామి జాతర అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. ఆలయ అభివృద్ధికి, సౌకర్యాల కల్పన నిమిత్తం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తనవంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఆలయ కమిటీసభ్యులు ఆమెను సన్మానించారు. కార్యక్రమంలో సీఐ ఆల్లం నరేందర్‌, డీడీ రమాదేవి, జీసీడీవో శకుంతల, ఎస్సై రమేష్‌, ఆలయకమిటీ చైర్మన్‌ లక్ష్మణ్‌, సభ్యులు కట్టి, ముత్త పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2024 | 10:46 PM