Share News

Kumaram Bheem Asifabad: ప్రజావాణి సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jun 10 , 2024 | 10:23 PM

ఆసిఫాబాద్‌, జూన్‌ 10: ప్రజావాణి కార్యక్ర మం ద్వారా ప్రజల సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తామని అదనపు కలె క్టర్‌ దాసరి వేణు అన్నా రు.

 Kumaram Bheem Asifabad:  ప్రజావాణి సమస్యల పరిష్కారానికి కృషి

- అదనపు కలెక్టర్‌ దాసరి వేణు

ఆసిఫాబాద్‌, జూన్‌ 10: ప్రజావాణి కార్యక్ర మం ద్వారా ప్రజల సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తామని అదనపు కలె క్టర్‌ దాసరి వేణు అన్నా రు. సోమవారం కలెక్టరే ట్‌లో నిర్వహించిన ప్రజా వాణిలో కాగజ్‌నగర్‌ ఆర్డీవో సురేష్‌తో కలిసి అర్జీదారుల నుంచి దర ఖాస్తులను స్వీకరించారు. రెబ్బెన మండలం రాజారాం గ్రామానికి చెందిన గజ్జెల్లి సత్యమ్మ తనపేరిట మూడెకరాల భూమికి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేయాలని దరఖాస్తు అందజేశారు. కాగజ్‌నగర్‌ మండలం నజ్రుల్‌నగ ర్‌కు చెందిన మధు కస్తూర్బా గాంధీ విద్యాల యంలో ఉపాధి కోసం దరఖాస్తు అందజేశారు. జైనూరు మండలం భూసిమెట్ట గ్రామానికిచెందిన బొల్లక్‌ ధ్రుపతాబాయి తనపేరిట అటవీహక్కు పత్రాలు ఉన్నాయని రైతుబంధు మంజూరుకు దరఖాస్తు అందజేశారు. సిర్పూర్‌(యు) మండలం కోహినూర్‌కు చెందిన శకుంతల కేజీబీవీలో వంట మనిషికి బదులు స్వీపర్‌ పని కల్పించా లని దరఖాస్తు అందజేసింది. బెజ్జూరు మండలానికి చెందిన తులసీరాం తన కు అటవీశాఖ నుంచి ఆరు సంవత్సరాల బీడీ ఆకు కమీషన్‌ ఇప్పించాలని దర ఖాస్తు అందజేశారు. జైనూరు మండలం ఆవపల్లి గ్రామానికి చెందిన రాథోడ్‌ గుణవంతరావు 2012 డీఎస్సీలో ఎంపికైనందున తనకు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ చేసి ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నాడు. బెజ్జూరు మండలం పాపనపేటకు చెందిన బుజాడి లక్ష్మి తాను సాగు చేసుకుంటున్న భూమిని తన పేరిట పట్టా పాసు పుస్తకం ఇప్పించాలని దరఖాస్తు చేసింది. కెరమెరి మండలం కొలాం కోటారి గ్రామానికి చెందిన బీము తన సోదరుడి పేరిట ఉన్న భూమిలో తనవాటా ఉన్నందున వాటా భూమి ఇప్పించాలని దరఖాస్తు అందజేశారు. బెజ్జూరు మండలం తుమ్మలగూడ గ్రామానికి చెందిన జాడిశంకర్‌ పెన్షన్‌ మంజూరు కొరకు దరఖాస్తు అందజేశారు.

Updated Date - Jun 10 , 2024 | 10:23 PM