Kumaram Bheem Asifabad: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి: ఎమ్మెల్యే హరీష్బాబు
ABN , Publish Date - Sep 21 , 2024 | 10:18 PM
చింతలమానేపల్లి, సెప్టెంబరు 21: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్ప నకు కృషిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్బాబు తెలిపారు. శని వారం మండలంలోని కర్జవెల్లి, దిందా, కేతిని, గూడెం తదితర గ్రామాల్లో పర్య టించి సమస్యలను తెలుసుకున్నారు.
- ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు
చింతలమానేపల్లి, సెప్టెంబరు 21: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్ప నకు కృషిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్బాబు తెలిపారు. శని వారం మండలంలోని కర్జవెల్లి, దిందా, కేతిని, గూడెం తదితర గ్రామాల్లో పర్య టించి సమస్యలను తెలుసుకున్నారు. త్వరలోనే కర్జవెల్లి నుంచి గూడెం వరకు ఉన్న ప్రధానరహదారికి మరమ్మతులు, కేతిని-దిందా వాగుపై హైలెవల్ వంతెన నిర్మిస్తామని తెలిపారు. గ్రామాల్లో చాలామంది జ్వరాల బారిన పడు తున్నారని ఎమ్మెల్యే దృష్టికి రాగా వైద్యసిబ్బంది అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామ న్నారు. ప్రజలు సైతం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీసమస్య త్వరలోనే పరిష్క రిస్తానన్నారు. అనం తరం కేతినిగ్రామంలోని గిరిజనఆశ్రమపాఠశాలను తనిఖీచేశారు. ఈసంద ర్భంగా 5వతరగతి విద్యార్థుల విషయపరిజ్ఞానాన్ని పరీక్షిం చారు. విద్యార్థులు చదువులో రాణించాలన్నారు. అనంతరం విద్యార్థులకు పండ్లరసాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, మల్లయ్య, నానయ్య, సుధాకర్, మనోహర్గౌడ్, శంకర్, తుకారాం, నానాజీ, ఎర్రయ్య, రంగన్న, రమేష్, పురు షోత్తంచారి, పవన్,మురళీ,మోహన్, సంజీవ్,భాస్కర్, రామయ్య, సాయి, రేహన్, అతిక్, తిరుపతి పాల్గొన్నారు.