Share News

Kumaram Bheem Asifabad: ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను నమోదు చేయాలి

ABN , Publish Date - Jan 08 , 2024 | 10:56 PM

ఆసిఫాబాద్‌, జనవరి 8: ఈనెల 6వరకు నిర్వహించిన ప్రజాపాలనలో పజల నుంచి అందిన దరఖాస్తుల పూర్తి వివరాలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్నారు.

Kumaram Bheem Asifabad:  ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను నమోదు చేయాలి

- రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతకుమారి

ఆసిఫాబాద్‌, జనవరి 8: ఈనెల 6వరకు నిర్వహించిన ప్రజాపాలనలో పజల నుంచి అందిన దరఖాస్తుల పూర్తి వివరాలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపుకలెక్టర్‌లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ దృష్ట్యా ప్రభు త్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో అందిన దరఖాస్తుల వివరాలను ఆన్‌లై న్‌లో స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలు, నూతన రేషన్‌కార్డులు, పెన్షన్‌ కొరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే మాట్లాడుతూ ఈ నెల6 వరకు దరఖాస్తులు స్వీకరించామని, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామన్నారు. ఈనెల17లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని రైస్‌ మిల్లర్లకు నిర్దేశిం చిన సీఎంఆర్‌ లక్ష్యాలను పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారులు, రైస్‌మిల్లర్ల సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు దాసరి వేణు, దీపక్‌ తివారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 10:56 PM