Share News

Kumaram Bheem Asifabad: త్వరితగతిన వంతెన పనులు పూర్తిచేయాలి

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:27 PM

పెంచికలపేట, జూన్‌ 3: మండలం లోని ఎర్రగుంట ఉచ్చమల్ల వాగుపై నిర్మిస్తున్న లోలెవల్‌ వంతెన పనులను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు.

Kumaram Bheem Asifabad: త్వరితగతిన వంతెన పనులు పూర్తిచేయాలి

- ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

పెంచికలపేట, జూన్‌ 3: మండలం లోని ఎర్రగుంట ఉచ్చమల్ల వాగుపై నిర్మిస్తున్న లోలెవల్‌ వంతెన పనులను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. సోమవారం ఆయన పనులను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తానని అన్నారు. పనులునాణ్యతతో చేపట్టాలని కాంట్రా క్టర్‌ను ఆదేశించారు. నిర్దేశించిన గడువులోపు పనులను పూర్తిచేయాలన్నారు. అనంతరం మొట్లగూడ గ్రామంలో ఇటీవలవడదెబ్బతో మృతిచెందిన రైతు చౌదరి మహేష్‌ కుటుంబ సభ్యులతోపాటు గుంట్లపేట గ్రామానికి చెందిన మాజీసర్పంచ్‌ దాసరి చంద్రమౌళి కుమారుడు జీవన్‌కుమార్‌ కిడ్నీ వ్యాధితో మృతిచెందగా బాధిత కుటుంబాలను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఆయనవెంట నాయకులు మహేష్‌, పెంటయ్య, కాంతారావు, మహేష్‌, భాస్కర్‌, ప్రభాకర్‌, నగేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 11:27 PM