Kumaram Bheem Asifabad: తెల్లారక ముందే ఎరువుల కోసం పడిగాపులు
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:19 PM
సిర్పూర్(టి), జూలై 8: మండల కేంద్రంలోని సహకారసంఘానికి ఎరువుల కోసం రైతులు ఉదయం 7గంటలకే వచ్చి కూర్చుంటున్నారు.

సిర్పూర్(టి), జూలై 8: మండల కేంద్రంలోని సహకారసంఘానికి ఎరువుల కోసం రైతులు ఉదయం 7గంటలకే వచ్చి కూర్చుంటున్నారు. ఒక్కొక్క రైతు పదినుంచి ఇరవై యూరియా బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సహకార బ్యాంకు సిబ్బంది వచ్చి స్టాక్ప్రకారం అందరికీ సరిపడేలా వారి ఆధార్కార్డు, పట్టాపాసుపుస్తకంతో బయోమెట్రిక్విధానం ద్వారా రెండు, మూడుబస్తాలు ఇస్తున్నారు. దీంతో ఎక్కువభూమి ఉన్న రైతులు ఇవి సరిపో వడం లేదని పేర్కొంటున్నారు. ఈవిషయంపై వ్యవవసాయాధికారి మధుల తను వివరణ కోరగా తాము రోజుకు నాలుగైదు లారీల ఇండెంట్ పెడుతు న్నామని లారీలు ఆలస్యంగా రావడంతో ఈ సమస్య వస్తోందన్నారు. ఇక నుంచి రైతులకు సరిపడ యూరియా బస్తాలు సరఫరా అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.