Kumaram Bheem Asifabad: బడిబాటను విజయవంతం చేయాలి: కలెక్టర్
ABN , Publish Date - Jun 07 , 2024 | 10:32 PM
రెబ్బెన, జూన్ 7: బడిబాటను విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం మండలంలోని తక్కళ్లపల్లిలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

రెబ్బెన, జూన్ 7: బడిబాటను విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం మండలంలోని తక్కళ్లపల్లిలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాఽధ్యాయులు సహకరించి తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు వచ్చేట్టు చూసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన విద్యను అందుతుందన్నారు. పిల్లలను ప్రయివేటులో చేర్పించి ఆర్థికంగా నష్టపోకూడదన్నారు. ప్రభుత్వపాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించటానికి అధికారులు సిద్ధంగాఉన్నట్టు తెలిపారు. ఈసందర్భంగా ఎంపీ టీసీ శ్రీనివాస్ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అద నపు కలెక్టర్ దీపక్ తివారి, ఎంపీపీ సౌందర్య, డీఈవో అశోక్, తదితరులు పాల్గొన్నారు.