Kumaram Bheem Asifabad: డంప్ యార్డును పరిశీలించిన అదనపు కలెక్టర్
ABN , Publish Date - May 23 , 2024 | 10:17 PM
కాగజ్నగర్, మే 23: కాగజ్నగర్లో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్-1 సమీపంలో ఉన్న డంప్యార్డును గురువారం అదనపుకలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు.
![Kumaram Bheem Asifabad: డంప్ యార్డును పరిశీలించిన అదనపు కలెక్టర్](https://media.andhrajyothy.com/media/2024/20240511/1_1_ac0a5713f6.jpg)
కాగజ్నగర్, మే 23: కాగజ్నగర్లో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్-1 సమీపంలో ఉన్న డంప్యార్డును గురువారం అదనపుకలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. ఈ సందర్భంగా మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్-1 ప్రిన్సిపాల్ మీర్ సుజాత్అలీ హాష్మి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డంప్ యార్డు ఉండటంతో చెత్తను తగులబెడుతున్నప్పుడు పొగవచ్చి విద్యార్థులు శ్వాస తీసు కోలేని పరిస్థితి ఉంటోందని తెలిపారు. స్పందించిన అదనపు కలెక్టర్ డంప్ యార్డును తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ అంజయ్య, సిబ్బంది ఉన్నారు.