Share News

Kumaram Bheem Asifabad: ఘోర రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Jan 21 , 2024 | 10:47 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, జన వరి 21: జిల్లాకేంద్రం సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాగజ్‌నగర్‌ మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన సర్వర్‌ తన భార్య షహారా భాను (35), షేక్‌ ఆసీఫ్‌(16)తో కలిసి బైక్‌పై ఆసిఫాబాద్‌ మండలంలోని చిర్రకుంట గ్రామంలోగల తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నారు.

Kumaram Bheem Asifabad: ఘోర రోడ్డు ప్రమాదం

- బైక్‌ను ఢీకొట్టిన కంటైనర్‌ లారీ

- తల్లీ, కొడుకు అక్కడికక్కడే మృతి

ఆసిఫాబాద్‌ రూరల్‌, జన వరి 21: జిల్లాకేంద్రం సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాగజ్‌నగర్‌ మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన సర్వర్‌ తన భార్య షహారా భాను (35), షేక్‌ ఆసీఫ్‌(16)తో కలిసి బైక్‌పై ఆసిఫాబాద్‌ మండలంలోని చిర్రకుంట గ్రామంలోగల తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఆసిఫాబాద్‌ దాటిన తరువాత జంక్షన్‌ వద్ద రెబ్బెనవైపు నుంచి వచ్చిన కంటైనర్‌.. బైక్‌ను వెనకాల ఢీకొంది. ఈ ప్రమాదంలో కంటైనర్‌.. తల్లీ కొడుకుల మీది నుంచి వెళ్లింది. ఏం జరిగిందని సర్వర్‌ వెనక్కి చూసేలోపే అతని భార్య, కొడుకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సర్వర్‌ బోరున విలపించాడు. అదుపు తప్పిన కంటైనర్‌ రోడ్డుకు అవతలి వైపునకు వెళ్లగా అటుగా వాంకిడి వైపు నుంచి వస్తున్న లారీ కంటైనర్‌కు ఢీకొట్టింది. కంటైనర్‌ వేగంగా వచ్చి ఢీకొనడంతోనే దుర్ఘటన జరిగిందని సర్వర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని కొద్దిసేపు హైవేపై మృతదేహాలతో నిరసన వ్యక్తం చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే..

ప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగితెలుసుకున్నారు. ప్రమాదం జరగడం బాధగా ఉందని మూలమలుపు ఇబ్బందికరంగా మారిందన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Jan 21 , 2024 | 10:47 PM