Share News

Kumaram Bheem Asifabad: ఆధునిక హంగులతో ముస్తాబైన గ్రంథాలయం

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:32 PM

ఆసిఫాబాద్‌, మార్చి 14: జిల్లాకేంద్రంలో రూ.1.50కోట్ల రూర్బన్‌ నిధులతో ఆదునికహంగులతో జిల్లాశాఖ గ్రంథాలయం ముస్తాబైంది. శుక్రవారం ఈ గ్రంథాలయాన్ని రాష్ట్రపంచాయతీరాజ్‌, జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రిసీతక్క ప్రారంభించనున్నారు.

 Kumaram Bheem Asifabad: ఆధునిక హంగులతో ముస్తాబైన గ్రంథాలయం

- నేడు ప్రారంభించనున్న మంత్రి సీతక్క

ఆసిఫాబాద్‌, మార్చి 14: జిల్లాకేంద్రంలో రూ.1.50కోట్ల రూర్బన్‌ నిధులతో ఆదునికహంగులతో జిల్లాశాఖ గ్రంథాలయం ముస్తాబైంది. శుక్రవారం ఈ గ్రంథాలయాన్ని రాష్ట్రపంచాయతీరాజ్‌, జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రిసీతక్క ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్నిఏర్పాట్లు చేయగా కలెక్టర్‌ పరిశీలిం చారు. గ్రంథాలయ భవనాన్ని జీ ప్లస్‌వన్‌లో నిర్మించగా గ్రౌండ్‌ఫ్లోర్‌లో రీడింగ్‌, రైటింగ్‌ ఫర్నీచర్‌తో కూడిన మూడు విశాలమైన హాల్స్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయం, చైర్మన్‌ చాంబర్‌, సిబ్బంది గది, టాయిలెట్స్‌ నిర్మించారు. మొదటి అంతస్తులో మహిళలకు, పురు షులకు విడివిడిగా విశాలమైన రీడింగ్‌, రైటింగ్‌హాల్స్‌ను ఏర్పాటు చేశారు. రూ.5లక్షల నిధులతో పుస్తకాలను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచారు.

Updated Date - Mar 14 , 2024 | 11:32 PM