Share News

ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN , Publish Date - Feb 29 , 2024 | 10:24 PM

రామకృష్ణా పూర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

రామకృష్ణాపూర్‌, ఫిబ్రవరి 29: రామకృష్ణా పూర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్ర మాన్ని ఉద్దేశించి పల్లె రాజు మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలలో మరో రెండు పథకాలు రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను, సింగరేణి కార్మికుడు ప్రమద వశాత్తూ మర ణిస్తే కోటీ రూపాయల ఇన్సూరెన్స్‌ వర్తించేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించినా సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ క్షీరాభిషేకం నిర్వహించి నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షు డు పల్లె రాజు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జంగం కళ, వైస్‌ చైర్మన్‌ ఎర్రం విద్యాసాగర్‌, కౌన్సిలర్లు పనసా రాజు, పొలం సత్యం, పూల్లురి సుధాకర్‌, కొక్కుల స్రవంతి, తదితరులు పాల్గొన్నారు

Updated Date - Feb 29 , 2024 | 10:24 PM