Share News

కొండగట్టుకు పాదయాత్ర

ABN , Publish Date - Apr 17 , 2024 | 10:49 PM

కోటపల్లి మండల కేంద్రానికి చెందిన 14 మంది మాల ధారణ భక్తులు బుధవారం సాయంత్రం కొండగట్టుకు పాదయాత్రగా బయలు దేరారు.

కొండగట్టుకు పాదయాత్ర

కోటపల్లి, ఏప్రిల్‌ 17: కోటపల్లి మండల కేంద్రానికి చెందిన 14 మంది మాల ధారణ భక్తులు బుధవారం సాయంత్రం కొండగట్టుకు పాదయాత్రగా బయలు దేరారు. మూడు రోజులపాటు పాదయాత్రగా వెళ్లి హనుమాన్‌ జయంతి నాటికి కొండగట్టుకు చేరుకోనున్నట్లు తెలిపారు. పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్‌ భక్తులకు మంగళహారతులు,ప్రత్యేక పూజలతో కుటుంబ సభ్యులు వీడ్కోలు పలికారు.

Updated Date - Apr 17 , 2024 | 10:49 PM