Share News

ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:07 PM

ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆటోలకు గిరాకీలు లేక ఫైనాన్స్‌లు కట్టలేక ఆత్మహత్య చేసు కున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.25 లక్షలు చెల్లించాలని గురువారం తహసీల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్‌కు ఆటో యూనియన్‌ నాయకులు వినతి పత్రాలు అందించారు.

ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

మందమర్రిటౌన్‌, ఏప్రిల్‌ 25: ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆటోలకు గిరాకీలు లేక ఫైనాన్స్‌లు కట్టలేక ఆత్మహత్య చేసు కున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.25 లక్షలు చెల్లించాలని గురువారం తహసీల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్‌కు ఆటో యూనియన్‌ నాయకులు వినతి పత్రాలు అందించారు. ఆటో యూనియన్‌ నాయకులు మేడి రాజు, దాసరి కుమార్‌, బండారి మల్లేష్‌లు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మీ పథకం ప్రవేశపెట్టడంతో ఆటోలకు గిరాకీలు లేకుండా పోయాయన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12 వేలు చెల్లించాలని, ఆటో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆటో డ్రైవర్లు మృతి చెందితే రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్‌ ఇవ్వాలని, ఫైనాన్స్‌ల వారి వేదింపులను అరికట్టాలన్నారు. గౌస్‌, కుమార్‌, శ్రీనివాస్‌, షరీఫ్‌, శ్రీను, గౌస్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:07 PM